రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక వ్యవహారాల, యువజన సర్వీసుల మరియు క్రీడా శాఖ మంత్రి శ్రీమతి ఆర్ కె రోజా లైన్స్ ఇంటర్నేషనల్ క్లబ్ మరియు రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం సంయుక్తంగా శనివారం తిరుపతిలో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవం లో పాల్గొని మహిళా ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు. తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో ప్రభుత్వ రంగంలో ఉపాధ్యాయులుగా, సాంకేతిక నిపుణులుగా, సేవా దృక్పదంతో పనిచేస్తూ ఉత్తమ సేవలు అందించిన మహిళలను ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా మంత్రి గారు మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా ఎదిగినపుడే సమాజంలో ఉన్నత స్థానంలో ఉంటారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంక్షేమం కోసమే అహర్నిశలు కృషి చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర మంత్రి కి లయన్స్ క్లబ్ నిర్వాహకులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డి.ఈ.ఓ శేఖర్, తిరుపతి మండల విద్యాశాఖ అధికారి ప్రభాకర్ రాజు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు మునికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
previous post