40.2 C
Hyderabad
May 1, 2024 17: 21 PM
Slider నిజామాబాద్

గోపన్పల్లి లో వైకుంఠ ధామం ప్రారంభం

#Bichkunda Harithaharam

బిచ్కుంద మండలంలోని గోపన్పల్లి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా నిర్మించిన వైకుంఠదామాన్ని జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ సిండే, ఎన్డిసిసి బ్యాంకు చైర్మన్ భాస్కర్ రెడ్డి, కామారెడ్డి జిల్లా జడ్పీ ఛైర్పర్సన్ దఫేదర్ శోభలు ప్రారంభించారు. అనంతరం ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా వారు వైకుంఠ ధామ ప్రాంగణంలో మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ పల్లె ప్రగతిలో వైకుంఠ ధామ నిర్మాణం త్వరగతిన పూర్తి చేసినందుకు   స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో వీరితో పాటు స్థానిక సర్పంచ్ శ్రీనివాస్ ఎంపీటీసీ సుజాత రాములు ఎంపీపీ అశోక్ పటేల్ ,వైస్ఎంపిపి రాజు పటేల్ ,జడ్పిటిసి భారతి రాజు, మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు సంధి సాయవ్వ సాయిరాం, తెరాస అధ్యక్షులు వెంకట్రావ్ దేశాయి, ఆయా గ్రామాల సర్పంచ్లు ఎంపీటీసీలు తెరాస శ్రేణులు అధికారులు పాల్గొన్నారు.

Related posts

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతీయ నాయకుల చిత్రపటాలు అందజేత

Satyam NEWS

గ్రీన్ ల్యాండ్ ఉన్నత పాఠశాలలో కరోనా వైరస్ పై అవగాహన

Satyam NEWS

ఆర్టీసీ సమ్మెపై ప్రభుత్వ కఠిన నిర్ణయం

Satyam NEWS

Leave a Comment