కొల్లాపూర్ లోని గ్రీన్ ల్యాండ్ స్కూల్ లో నేడు కరోనా వైరస్ పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ఇ. వెంకటేష్ యాదవ్ మాట్లాడుతూ కరోనా వైరస్ రాకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చేతులు శుభ్రంగా సబ్బుతో కడుక్కోవాలని తెలిపారు.
మొహానికి మాస్కులు ధరించాలని చల్లని పదార్థాలు తినకూడదని, జ్వరం, జలుబు, దగ్గు, వచ్చినప్పుడు వెంటనే డాక్టర్ సంప్రదించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శంకర్ మేనేజ్ మెంట్ సభ్యులు నరేష్, కుమారస్వామి ఉపాధ్యాయ బృందం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.