ప్రభుత్వ వైద్యుల సంఘం అధ్యక్షుడు (డి హెచ్ విభాగం) డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ ( డిప్యూటీ సివిల్ సర్జన్) పుట్టినరోజు వేడుకలు నేడు ఘనంగా జరిగాయి. హైదరాబాద్ లోని నీలోఫర్ ఆసుపత్రిలో జరిగిన ఈ కార్యక్రమంలో అన్ని విభాగాల వైద్యులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్ మాట్లాడుతూ అందరి ప్రేమాభిమానాలు ఇంకా ఎక్కువ బాధ్యతను పెంచాయని అన్నారు. ఆపదలో ఉన్న అనేక మంది కి సేవ చేసే అదృష్టం దేవుడు మనకు కల్పించాడని అందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
అందరూ పేషంట్స్ కు మంచి వైద్యం అందించి నిలోపర్ వైద్యశాలకు మంచి పేరు తీసుకువద్దామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నిలోపర్ వైద్యశాల మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మురళిక్రిష్ణ, సిఎస్ అర్.యం.ఓ.డాక్టర్ జ్యోతి, డాక్టరు ప్రవీణ, ప్రొఫెసర్ వినోద్, పిడియట్రిక్ విభాగం హెచ్ ఓ డి డాక్టర్ అపర్ణ, ప్రొఫెసర్ రవి కుమార్, గ్రేడ్ ఒన్ నర్సింగ్ సుప్రీండెంట్ యం. హెచ్ లక్ష్మి, గ్రేడ్ టు నర్సింగ్ సూపరింటెండెంట్ విజయ లక్ష్మి, స్టెల్లా మరి, పుష్పలత, వజ్ర, పద్మ, సీనియర్ నర్సింగ్ స్టాఫ్ శ్రీదేవి, నిర్మలా జ్యోతి మరియు ఇతర యూనియన్ నాయకులు పాల్గొన్నారు.