ఖమ్మం ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కి మళ్ళీ అవకాశం దక్కడం పట్ల డోర్నకల్ బిషప్ పద్మారావు మంత్రి పువ్వాడకు పుష్పగుచ్చం అందజేసి హర్షం వ్యక్తం చేశారు. ఖమ్మం నగరంలో మంచి పాలన అందించి, ప్రజల
ప్రేమ, అభిమానం చూరగొన్నారని, రానున్న ఎన్నికల్లో మంచి విజయం సాధించి ఇదే ఒరవడి కొనసాగించాలని ప్రత్యేక ప్రార్థన చేసి ఆశీర్వదించారు.వారి వెంట డోర్నకల్ డయోసిస్ ట్రెజరర్ ప్రభాకర్, పాస్టర్ విశ్వం, ప్రిస్కిల్లా, దయానంద్ తదితరులు ఉన్నారు.