తనకు పార్టీ బీ ఫారం ఇవ్వకుండా మరొకరికి ఇవ్వడంతో ఆగ్రహించిన ఓ బీజేపీ అభ్యర్థి బీ ఫారం చింపేసిన ఘటన కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో మంగళవారం చోటుచేసుకుంది. మున్సిపాలిటీలోని 9 వార్డులో బీజేపీ తరపున రెండు నామినేషన్ లు దాఖలయ్యాయి. పార్టీ బి ఫారం కుందనపల్లి గీతకు ఇవ్వడంతో ఆగ్రహించిన మరో అభ్యర్థి రమేష్ ఆమె బి ఫారంను చింపేశాడు. దీంతో నామినేషన్ కేంద్రం వద్ద ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు ఇరువురికి కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడి నుంచి పంపించేశారు.
previous post