ఇటీవల కురిసిన భారీ వర్షాలు కారణంగా వరద ముంపుకు గురైన కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సహాయం సరిగ్గా అందటం లేదని బిజెపి ఆరోపించింది.
వరద సహాయ నిధిని అధికార పార్టీ నాయకులు కొందరు కమిషన్ తీసుకుని ఇస్తున్నారని, నిజమైన వరద బాధితులకు అన్యాయం చేస్తున్నారని బిజెపి నాయకులు అన్నారు.
ఆర్థిక సాయాన్ని దారి మళ్లిస్తున్న వారి పై విచారణ జరిపి తగిన చర్యలు తీసుకోవాలని మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా అడిషనల్ కలెక్టర్ కె. విద్యాసాగర్ కు మేడ్చల్ – మల్కజ్ గిరి బిజెపి అర్బన్ జిల్లా ప్రెసిడెంట్ పన్నాల హరీష్ రెడ్డి, మేడ్చల్ మల్కజ్ గిరి రూరల్ జిల్లా ప్రెసిడెంట్ విక్రం రెడ్డి, బి.జే.వై.యం. స్టేట్ ప్రెసిడెంట్ భాను ప్రకాష్, సీనియర్ నాయకులు వినతి పత్రం ఇచ్చారు.