సూర్యాపేట జిల్లా బిజెపి అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి ఆధ్వర్యంలో పలువురు నేడు భారతీయ జనతా పార్టీలో చేరారు.
రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ సమక్షంలో హుజూర్ నగర్ అసెంబ్లి నియోజకవర్గం చింతలపాలెం మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు దొండపాడు ఎంపిటిసి-2 తోట సంధ్య, కాంగ్రెస్ పార్టీ దొండపాడు గ్రామ శాఖ అధ్యక్షుడు తోట శేషుతో పాటు టిఆర్ఎస్ పార్టీ 13 వ వార్డు మెంబర్ ఉప్పతల స్వప్న, అంకమరాజు, 14 వ వార్డు మెంబర్ బండారు మేరీ నాగరాజు వారి అనుచరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.
వారందరికి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ బిజేపి కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. చేరిన వారందరూ పార్టీ బలోపేతానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా అధ్యక్షుడు బొబ్బా భాగ్యరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతూ నవ భారత నిర్మాణం కోసం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపడుతున్న పథకాలు, కార్యక్రమాలు నచ్చి ఇతర పార్టీ నేతలు బిజెపిలో చేరుతున్నారని అన్నారు.
రాష్ట్రంలో టీఆర్ఎస్ కు బిజెపి మాత్రమే సరైన ప్రత్యామ్నాయమని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాషాయ జెండా గెలుపే దిశగా నేతలు పని చేయాలని అన్నారు.