తెలంగాణ రాష్ట్రంలో రైతాంగ సమస్యలు పరిష్కరించాలని రైతులకు సంఘీభావంగా భారతీయ జనతా పార్టీ పిలుపు మేరకు ఈరోజు ఉదయం 10:00 ల నుండి సాయంత్రం 5:00 ల వరకు బీజేపీ జిల్లా అధ్యక్షులు బస్వా లక్ష్మీ నర్సయ్య దీక్ష చేపట్టారు.
ప్రభుత్వం వెంటనే డిమాండ్లు పరిష్కరించి రైతాంగాన్ని ఆదుకోవాలని ఆయన పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు చేసే ధాన్యానికి తేమ, తాలు, తప్ప పేరిట రైస్ మిల్లర్లు కోత తీస్తున్నారని అలా చేయకుండా చూడాలని ఆయన డిమాండ్ చేశారు.
గన్నీబ్యాగులు, హమాలీల కొరత , ధాన్యం తరలింపు కు లారీల కొరత లేకుండా ప్రభుత్వం చూడాలని ఆయన కోరారు. అకాల వర్షాల వల్ల తడిసిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వమే ఎలాంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని ఆయన కోరారు. లాక్ డౌన్ సమయంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తగిన ఏర్పాట్లు చేయాలని బస్వా లక్ష్మీ నర్సయ్య కోరారు.