28.2 C
Hyderabad
May 8, 2024 23: 27 PM
Slider నల్గొండ

పుడమిని నమ్ముకున్న రైతుకు మరణమే శరణ్యమా?

#BJPNalgonda

పుడమి తల్లిని నమ్ముకుని జీవిస్తున్న నర్సింహులు అనే రైతు, తనకున్న కొద్దిపాటి పొలమే తన జీవనాధారంగా బతుకును నెట్టుకొస్తున్నాడని, అలాంటి రైతుకు సాయం అందించే ప్రభుత్వమే అతని మరణానికి కారణం అయిందని సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ పట్టణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు ముస్కుల చంద్రారెడ్డి అన్నారు.

దళితులపై దాడులకు నిరసనగా సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయం ముందు భారతీయ జనతా పార్టీ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో భాగంగా ఈసందర్భంగా సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ పట్టణ బీజేపీ పార్టీ అధ్యక్షుడు ముస్కుల చంద్రారెడ్డి  మాట్లాడుతూ నర్సింహులు తనకున్న కొద్దిపాటి భూమిని కాస్తా రెవెన్యూ అధికారులు రైతు భవన నిర్మాణానికి కేటాయించారని, దీనితో తనకున్న కొద్దిపాటి భూమిని పోగొట్టుకున్న ఆ రైతు ఆధారం కోల్పోయాననే ఆవేదనతో  పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడని అన్నారు.

అధికార దాహంతో టిఆర్ఎస్ శ్రేణులు ఆ రైతు చావుకు కారణమయ్యారని, ఆ రైతు కుటుంబానికి నష్టపరిహారంగా కోటి రూపాయలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం హుజుర్ నగర్ అధ్యక్షులు వల్లపుదాసు గోపీనాథ్ గౌడ్, దెనుమకొండ రామరాజు, శివాచారీ, శివ, సాయి పవన్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

దేవుడు కన్నా మోడీ అంటేనే జగన్ కు భయం

Satyam NEWS

మహిళా గవర్నర్ ను అవమాన పరిచి మహిళ బంధు కార్యక్రమమా?

Satyam NEWS

ఫెస్టివల్:అభివృద్ధి ప్రదాత ఉద్యమ నేత కెసిఆర్

Satyam NEWS

Leave a Comment