హుజుర్ నగర్ పట్టణ ఒబిసి మోర్చా అధ్యక్షుడు నర్సింగ్ సతీష్ ఆధ్వర్యంలో భారతదేశ ప్రధాని నరేంద్రమోడీ చిత్రపటానికి పాలాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు.
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ కి జరిగిన పాలాభిషేకం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓబిసి మోర్చా జిల్లా అధ్యక్షుడు అంబళ్ళ నరేష్ గౌడ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశంలో మునుపెన్నడూ లేని విధంగా భారతీయ జనతా పార్టీ కేంద్ర క్యాబినెట్ లో 27 మంది ఓబిసి లకు స్థానం కల్పించటం వలన ఓబిసి ల ప్రతిష్టను పెంపొందించడంమే గాక ఓబిసి ల అభ్యున్నతికి పాటుపడే విధంగా ఉంది అన్నారు.
అదే విధంగా వివిధ సామజిక వర్గాల వారికి కూడా సముచిత స్థానం కల్పించారని ‘సబ్ కా సాత్,సాబ్ కా వికాస్’ అనే తారక మంత్రాన్ని మాటల్లో కాకుండా మోడీ తన క్యాబినెట్ లో అమలు చేసి చూపారని అన్నారు.కనుకనే ఈ రోజు మోడీ చిత్రపటానికి పాలాభిషేక కార్యక్రమం నిర్వహించడం జరిగిందని అన్నారు.
ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ బాల వెంకటేశ్వర్లు,వల్లపుదాసు గోపి,జగన్, ఇంటి రవి,కాల్వ వినోద్,కొప్పేర సాయి, గంధం సతీష్,గుండా గోపి,కంటు నాగరాజు, చింతలపూడి ఉమామహేశ్వరరావు,మునగ శ్రీను,పులి నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.