39.2 C
Hyderabad
May 3, 2024 12: 34 PM
Slider ముఖ్యంశాలు

మునుగోడులో గెలిచేది బీజేపీనే..

#bandi

మునుగోడు ఎన్నికల్లో పోలీసుల సాయంతో టీఆర్ఎస్ ఎన్ని అరాచకాలకు పాల్పడినా, దాడులతో భయభ్రాంతులకు గురిచేసినా వెరవకుండా ఓటేసి ప్రజాస్వామ్యాన్ని కాపాడిన మునుగోడు ఓటరు మహాశయులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. టీఆర్ఎస్ తొత్తులుగా మారి లాఠీఛార్జ్, దాడులతో భయభ్రాంతులకు గురిచేసినా, లాఠీఛార్జ్ చేసినా ప్రజాస్వామ్యబద్దంగా పోరాడిన బీజేపీ కార్యకర్తలకు సెల్యూట్ చేస్తున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మనీ, మద్యం ఏరులై పారించినా మునుగోడు గడ్డపై గెలిచేది బీజేపీ మాత్రమేనని ధీమా వ్యక్తం చేశారు.

గులాబీలకు గులాంగిరీ చేసే అధికారుల, పోలీసుల అంతు చూస్తామని హెచ్చరించారు. కేసీఆర్ జేబు వ్యక్తిగా మారిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిపై కచ్చితంగా ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ఎస్. ప్రకాశ్ రెడ్డి, అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, జె.సంగప్ప, ఐటీ విభాగం కన్వీనర్ వెంకటరమణ, ప్రశాంత్ తదితరులతో కలిసి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మీడియాతో మాట్లాడారు.

ఇప్పుడే ట్విట్టర్ టిల్లు టెలికాన్ఫరెన్స్ విన్న. 8 గంటలకు పోలింగ్ జరగాలట. డబ్బులిచ్చి ఓటర్లను తీసుకొచ్చి టీఆర్ఎస్ కు ఓటేయించండని చెబుతున్నడు.. దీనిపై ఫోన్ ద్వారా ఎన్నికల కమిషనర్ దృష్టికి తీసుకెళ్లామన్నారు.

నిర్బంధాలు, బెదిరింపులు, ప్రలోభాలను చేధించుకుని ఓటు హక్కును వినియోగించుకున్న మునుగోడు ప్రజలందరికీ బీజేపీ రాష్ట్ర శాఖ తరపున హృదయ పూర్వక ధన్యవాదాలు…చెప్పారు… బండి సంజయ్.ఎన్నికల ప్రక్రియను పూర్తిగా నాశనం చేసినావని…ఎన్నికలు సజావుగా జరపలేని నిస్సహాయుడివని..సీఎం కేసీఆర్ నుద్దేశించి.. ఎంపీ బండి సంజయ్ ధ్వజమెత్తారు.బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి శివన్నగూడెం వెళితే తప్పతాగి టీఆర్ఎస్ గూండాలు దాడికి యత్నించారని… సిద్దిపేట నుండి 200 మంది టీఆర్ఎస్ గూండాలు అరాచకం చేశారని.. చండూరు మున్సిపాలిటీ వైస్ ఛైర్మన్ పోలింగ్ బూత్ వద్ద క్యూలో ఉంటే ఎస్పీ వచ్చి అడ్డగోలుగా వ్యవహరించారని ఆరోపించారు.

మీరెన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మునుగోడులో గెలిచేది బీజేపీనేనని…. గెలిచేది రాజగోపాల్ రెడ్డి మాత్రమేనని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు ధీమా వ్యక్తం చేశారు. ఇక ఎస్ఐ నుండి ఎస్పీ వరకు అనుకూలమైన అధికారుల లిస్ట్ తయారు చేసుకుని వాళ్లకు డ్యూటీ వేసి బీజేపీ నేతలను, కార్యకర్తలను కొట్టించారు. అయినా మా కార్యకర్తలు అదరలేదు… బెదరలేదు. తెగించి కొట్లాడారు. చండూరులో విచక్షణారహితంగా కొట్టారని..ఈ విషయాన్ని కవర్ చేసేందుకు వచ్చిన వరంగల్ ఎన్టీవీ రిపోర్టర్ అరుణ్ ను కూడా పోలీసులు దాడికి యత్నించి గుంజుకుపోవడం సిగ్గుచేటన్నారు.

మీరెన్ని చేసినా టీఆర్ఎస్ అవుట్ కాబోతోందని… పురిట్లోనే బీఆర్ఎస్ ఖతం కాబోతోందని… అయ్యా ,కొడుకుల పనైపోయిందని.. అబద్దాల అల్లుడికి తగిన బుద్ది చెప్పబోతున్నారని..సంజయ్ జోస్యం చెప్పారు.ఒక గ్రామంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఓటుకు 50 వేలిచ్చారని… మెజారిటీ వస్తే టిక్కెట్ వస్తుందని అడ్డగోలుగా డబ్బులు పంచిండు. ఒక్క గ్రామానికే 20 కోట్లు ఖర్చు పెట్టినని బాహాటంగా చెప్పుకుంటున్నారంటే.. ఏ స్థాయిలో అవినీతికి పాల్పడి డబ్బు సంపాదించారో అర్ధమవుతోందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్నారు.

పోలింగ్ జరుగుతున్న టైంలోనే ట్విట్టర్ టిల్లు రంగంతండ, హాజినా తండా ప్రజలకు ఫోన్ చేసి అన్ని విధాలా ఆదుకుంటామంటూ ప్రజలను ప్రలోభపెడుతూ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారని బండి అన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలే బీజేపీ కండువాలు వేసుకుని తండాలకు పోవడం .. బీజేపీకి ఓటేస్తామనే వారిని పోలింగ్ కు రాకుండా అడ్డుకున్నారు. విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేశారని ఓటర్లకు రాత్రింబవళ్లు డబ్బులు పంచారన్నారు. 

అయినా ఏ ఒక్క టీఆర్ఎస్ కార్యకర్తను పట్టుకోలేదని బండి సంజయ్ ప్రశ్నించారు.ఇతరత్రా పనులకు డబ్బు తీసుకెళ్లే బీజేపీ నేతలను పట్టుకుంటున్న పోలీసులు… టీఆర్ఎస్ నేతలను ఎందుకు పట్టుకోలేదు? టీఆర్ఎసోళ్లు ఓటర్లకు మందు, మనీ పంచలేదని చెప్పే దమ్ముందా? అని ప్రశ్నించారు.గులాబీలకు మీరు చేసే గులాంగిరీ చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని… వాళ్లపై ఫిర్యాదు చేస్తాం… ఎన్నికల కమిషన్ పైనా ఫిర్యాదు చేస్తామన్నారు. మీరెన్ని కుట్రలు చేసినా… భారీ మెజారిటీతో గెలిచేది బీజేపీనేనని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Related posts

తొలకరి దృశ్యం

Satyam NEWS

తెదేపా, జనసేన మానిఫెస్టో కమిటీ కి దళిత త్రిదళ పత్రం

Satyam NEWS

బైపాస్ రోడ్డు పనులు నిలిపివేయాలి

Satyam NEWS

Leave a Comment