వనపర్తి సమీపంలోని శ్రీనివాసపురం, మెట్టుపల్లి పరిధిలోని సర్వే నంబర్ 55లో రైతుల భూముల మీదుగా వేస్తున్న బైపాస్ రోడ్డు పనులు నిలిపివేయాలని మాజీ జడ్పిటిసి వెంకటయ్య యాదవ్ డిమాండ్ చేశారు. చాలా ఏండ్లుగా రైతులు ఒకటి,రెండు ఎకరాల భూమి సాగుచేస్తూ జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. రైతులు గతములో రోడ్డు వేయవద్దని కోర్టు ద్వారా స్టే తెచ్చుకున్నారని చెప్పారు. బలవంతంగా అధికారులు సర్వే చేయడాన్ని ఖండించారు. రైతులకు ఎటువంటి ప్రత్యామ్నాయ మార్గాలను చూపకుండా, నష్టపరిహారం చెల్లించకుండా అడ్డుకున్న రైతులను అరెస్ట్ చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. వెంటనే పనులు నిలుపుదల చేయకుంటే ఉద్యమం చేస్తామని రైతులతో కలసి వెంకటయ్య యాదవ్ హెచ్చరించారు.