37.2 C
Hyderabad
May 6, 2024 11: 28 AM
Slider హైదరాబాద్

హై హాండెడ్ నెస్: పేద వాడి పొట్ట కొట్టిన బీజేపీ నేతలు

BJP highhandednes

హైదరాబాద్ లోని బాగ్ అంబర్ పేట్ డీడీ కాలనీ లో పాన్ డబ్బా ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్న ఓ పేద వాడి కుటుంబాన్ని బీజేపీ నేతలు రోడ్డు పై పడేశారు. స్థానికుడైన దాసు అనే వ్యక్తి 1985 నుండి డి డి కాలనీ వాటర్ ట్యాంక్ చౌరస్తా లో జలమండలి కి చెందిన స్థలంలో పాన్ డబ్బా ఏర్పాటు చేసుకుని దానిపై ఆధారపడి కుటుంబాన్ని పోషిస్తున్నాడు.

అయితే గత కొంతకాలంగా అదే కాలనీకి చెందిన కొంతమంది బిజెపి నేతలు అసోసియేషన్ ఏర్పాటు చేసి దాస్ కు చెందిన పాన్ డబ్బా పై కన్నేశారు. తమ కాలనీలో పాన్ డబ్బా ఉండరాదు అంటూ దాస్ ను వేధించడం ప్రారంభించారు. గత 30 సంవత్సరాలుగా ఎలాంటి అభ్యంతరం తెలుపని బీజేపీ నేతలు కొత్తగా దాస్ పై కక్ష కట్టి పాన్ డబ్బా ను తొలగించాలని ఒత్తిడి చేశారు.

ఈ విషయమై సదరు బీజేపీ నేతలు జిహెచ్ఎంసి అధికారులకు ఫిర్యాదు చేసి గురువారం ఉదయం దాస్ కు చెందిన పాన్ డబ్బా ను కూల్చివేశారు. తమ పార్టీకి చెందిన కార్యకర్తలు  ఇదే పరిసరాల్లో ఫుట్ పాత్ ను ఆక్రమించుకొని అక్రమ వ్యాపారాలు చేస్తున్నా పట్టించుకోని బీజేపీ నేతలు పేదవాడి పాన్ డబ్బా ను  కూల్చి వేయించి అతని కుటుంబాన్ని రోడ్డుపై పడేశారు. ఇదే డబ్బా పై ఆధారపడి అనారోగ్యంతో బాధపడుతున్న దాస్ కు ఈ పరిస్థితి మింగుడు పడడం లేదు. ఈ విషయంలో ప్రజా ప్రతినిధులు ,అధికారులు తనపై కనికరించి న్యాయం చేయాలని దాస్ విజ్ఞప్తి చేస్తున్నారు.

Related posts

విజయనగరం జిల్లా ఎస్పీతో కమ్యూనికేషన్ రీజనల్ ఎస్పీ భేటీ

Satyam NEWS

కాళేశ్వరం వద్ద పెరుగుతున్న గోదావరి

Bhavani

బ్రహ్మచారిని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చిన శ్రీశైల భ్రమరాంబ దేవి

Satyam NEWS

Leave a Comment