ఆర్టీసీ నిర్మల్ డిపో లో మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరిపారు. ముఖ్య అతిథిగా నిర్మల్ ఆర్డీవో ప్రసుమాంబా, షీ టీమ్ ఎస్ ఐ. అంజమ్మ పాల్గొన్నారు. ఆర్టీసీ మహిళా ఉద్యోగులచే పలు కార్యక్రమాలు చేయించారు. ఆటల పోటీలు పెట్టారు. ఆటలలో గెలుపొందిన వారికి జీఆర్ బి.క్లాత్ మార్చంట్, జీఆర్ బి, షాపింగ్ మహల్ వారి సౌజన్యంతో (దత్తాద్రి ద్వారా) ఆర్డీవో, ఎస్ ఐ చీరెలు బహుకరించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని, రాజకీయాల్లో, ఉద్యోగాల్లో అన్ని రంగాల్లో రాణించాలని,బస్ డిపో లో మహిళ ఉద్యోగులకు ప్రత్యేక సదుపాయాలు కలిపించాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో డిపో మేనేజర్ కే. ఆంజనేయులు, సహాయ మేనేజర్లు బి.విశ్వనాథ్, ప్రతిమరెడ్డి, ఆటపాటల్లో గెలుపొందిన అశ్విని, విజయలక్మి, ఊర్మిల పలు మహిళ ఉద్యోగులు పాల్గొన్నారు.
previous post