బీజేపీ నాయకుడు చేసిన మోసానికి బలైపోయిన ఒక జర్నలిస్టు ఆమరణ నిరాహార దీక్ష ప్రారంభించాడు. అంబర్పేట నియోజకవర్గం గోల్నాక తులసీనగర్ కాలనీ కి చెందిన బీజేపీ నాయకుడు శ్రీనివాస్రెడ్డికి అక్కడే నివాసం ఉండే అంబర్పేట నియోజకవర్గంలో అందరికీ సుపరిచితులైన గతంలో ఆంధ్రజ్యోతి పత్రికలో రిపోర్టరుగా పని చేసిన రవికుమార్ 5 ఏళ్ల క్రితం అప్పు ఇచ్చాడు. తన ఇంటి కాగితాలను బ్యాంకులో తాకట్టు పెట్టించి గోల్నాక తులసీనగర్ కాలనీ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద తన సొంత ఇంటిలో నివాసం ఉంటున్న సీనియర్ బీజేపీ నేత శ్రీనివాస్రెడ్డి కి 70 లక్షల రూపాయల అప్పు ఇచ్చాడు.
కేవలం నాలుగు నెలల్లో బ్యాంకు కాగితాలు విడిపించి ఇస్తానని నమ్మించిన శ్రీనివాస్రెడ్డి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇచ్చిన డబ్బు చెల్లించక పోవడమే కాకుండా నేను బీజేపీ సీనియర్ నేతను అంటూ.. ఏమి చేసుకుంటావో చేసుకో అంటూ బెదిరిస్తున్నాడు. గతంలో కూడా ఎంతో మంది వద్ద భారీగా అప్పులు చేసి బీజేపీ నేతనంటూ బెదిరిస్తూ ఎగవేయడం అతని నైజమని రవి తెలిపారు. శ్రీనివాస్రెడ్డికి ఇచ్చిన అప్పు తిరిగి రాక పోవడంతో తీవ్రమనస్తాపం చెందిన తన భార్య ఇటీవల ఆత్మహత్య చేసుకుందని రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
గతంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, బీజపీ సీనియర్ నేతలు బి.వెంకటర్రెడ్డి, డాక్టర్ గౌతం రావుతో పాటు పోలీసుల సమక్షంలో తనకు రావాల్సిన డబ్బు ఇస్తానంటూ రాజీ కొచ్చి కూడా మాటా మార్చాడని రవి రోదిస్తూ తెలిపారు. ఈ నెల 25 తన ఇంటిని వేలం వేస్తున్నారని ఇక తనకు గత్యంతరం లేక చావో రేవో తేల్చుకోవడానికి శ్రీనివాస్రెడ్డి ఇంట్లోనే ఈ రోజు మధ్యాహ్నం 2గంటలనుంచి ఆమరణ నిరాహార దీక్షకు దిగానని రవి తెలిపారు. రాజకీయ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు, నాతోటి జర్నలిస్టులు, పోలీసులు ఈ విషయంలో కలుగజేసుకొని న్యాయం చేయాలని రవి విజ్ఞప్తి చేస్తున్నాడు…లేదంటే తనకు చావే శరణ్యమని రవి రోదిస్తున్నాడు.
సత్యం న్యూస్, అంబర్పేట