శవాల మీద పేలాలు ఏరుకునట్టు చేయకండి. కేంద్రం పై తప్పు నెట్టడం తప్ప రాష్ట్ర ప్రభుత్వం చేసిందేంటి?
గ్రామాల్లో చాలా మంది వ్యాక్సినేషన్ కోసం ముందుకు రావడం లేదు. వారికి అవగాహన కల్పించండి.. రాజకీయాలు మానండి అంటూ బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలంగాణ మంత్రి కేటీఆర్ కు హితవు పలికారు.
ట్విట్టర్ వేదికగా కేటీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ఆమె విమర్శించారు. నేడు డీకే అరుణ జూమ్ కాన్ఫరెన్సులో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తప్పులు కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.
కరోనా నివారణలో రాష్ట్ర ప్రభుత్వం వైఫల్యం చెందిందని, కేటీఆర్ పచ్చి అబద్ధాలు చెబుతున్నారని ఆమె అన్నారు. టిఆర్ ఎస్ నాయకులు ప్రజల జీవితాలతో రాజకీయాలు చేస్తున్నారని ఆమె అన్నారు.
మనకు ఇవ్వకుండా వ్యాక్సిన్ విదేశాలకు ఇస్తున్నారని అబద్దాలు చెబుతున్నారని ఆమె అన్నారు. కరోనా పై మీ బాధ్యత ను తప్పించుకోవడానికి కేంద్రం పై అభాండాలు వేయకండని ఆమె హితవు చెప్పారు.