42.2 C
Hyderabad
April 26, 2024 18: 36 PM
Slider ప్రత్యేకం

వివేకా హత్య నిందితుల నుంచి జగన్ సోదరికి ప్రాణహాని

#y s sunitha

కడప ఎస్పీకి YS.వివేకానందరెడ్డి కుమార్తె డాక్టర్ సునీత లేఖ

మాజీ మంత్రి దివంగత వైఎస్‌ వివేకానందరెడ్డి కుమార్తె సునీతారెడ్డి కడప ఎస్పీకి లేఖ రాశారు. పులివెందులలో తన కుటుంబానికి భద్రత కల్పించాలని ఆ లేఖలో కోరారు.

ఈ నెల 10న మణికంఠరెడ్డి అనే వ్యక్తి తన ఇంటి వద్ద తన కుటుంబ సభ్యులు టార్గెట్ గా రెక్కీ నిర్వహించారని ఫిర్యాదులో వెల్లడించారు.

మణికంఠరెడ్డిని దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డి అనుచరుడిగా సునీత పేర్కొన్నారు. కార్యాలయంలో ఎస్పీ లేకపోవడంతో సిబ్బందికి సునీత లేఖ అందజేశారు.

ఈ నెల 10న సాయంత్రం 5:20 గంటలకు ఓ అనుమానితుడు తమ ఇంటిచుట్టూ రెండుసార్లు తిరిగాడని, ఇంటి కాంపౌండ్‌ తరువాతి డోర్‌ దగ్గర ఆగి ఫోన్‌ కాల్స్‌చేశాడని లేఖలో సునీత వెల్లడించారు.

శివశంకర్‌రెడ్డి బర్త్‌ డే కోసం ఏర్పాటైన ఫ్లెక్సీలోని వ్యక్తిలాగే అనుమానితుడు కనిపించాడని, ఈ విషయాన్ని సీఐకి ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు.

చివరికి ఆ వ్యక్తిని మణికంఠరెడ్డి అని తేల్చారని తెలిపారు. శివశంకర్‌రెడ్డికి మణికంఠరెడ్డి అత్యంత సన్నిహితుడని సునీత చెప్పారు.

తన తండ్రి హత్యకేసులో శివశంకర్‌రెడ్డి కీలకమైన అనుమానితుడని, ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకుని శివశంకర్‌రెడ్డి పాత్రను నిగ్గుతేల్చాలని కోరారు.

Related posts

మహనీయుల విగ్రహాలకే రక్షణ కల్పించలేరా?

Satyam NEWS

నీరు సకల చరాచర జీవులకు అత్యంత ఆవశ్యకం

Satyam NEWS

టోల్ రోడ్ లీజ్ వల్ల రాష్ట్రానికి నష్టం

Bhavani

Leave a Comment