ఇటీవల లిబియా దేశంలో అదృశ్యమైన సంతబొమ్మాళి మండలం సీతానగరం గ్రామానికి చెందిన యువకులను గత రాత్రి గుర్తించి రక్షించారు. ఈ మేరకు భారత విదేశాంగశాఖ శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యుడు కింజారపు రామ్మోహన్ నాయుడుకు తెలియచేసింది.
సీతానగరం యువకుల విషయాన్ని కింజారపు రామ్మోహన్ నాయుడు గత నెల 24వ తేదీ పార్లమెంట్లో ప్రస్తావించారు. వెంటనే భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ ప్రత్యేక చొరవ చూపించారు. తక్షణమే చర్యలు తీసుకుంటున్నామని పార్లమెంట్ సభ్యుడికి తెలియజేశారు.
అలాగే విషయం తెలిసిన వెంటనే సమాచారాన్ని వారి కుటుంబ సభ్యులకు తెలియజేయడమే కాకుండా వారితో కుటుంబ సభ్యులను చరవాణిలో మాట్లాడించారు.
త్వరలోనే వారిని ఇంటికి క్షేమంగా చేర్చుతామని వారి కుటుంబ సభ్యులకు ఎంపీ తెలియజేశారు. దీనికి వారి కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తపరుస్తూ ఎంపీకి తమ కృజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేశారు.