అమరావతిని రాష్ట్ర రాజధానిగా కొనసాగించేందుకు వీలుగా ప్రజలను సమాయత్తం చేయడంలో భాగంగా ఇంటింటికి అమరావతి కార్యక్రమాన్ని గుంటూరు జిల్లా నరసరావుపేటలో నిర్వహించారు. నరసరావుపేట తెలుగుదేశం పార్టీ ఇన్ చార్జి డాక్టర్ చదలవాడ అరవింద బాబు ఈ కార్యక్రమాన్ని భారీ ఎత్తున నిర్వహించారు. నరసరావుపేట పట్టణంలో స్థానిక రెండవ వార్డులో ఇంటింటికి అమరావతి అనే ఈ కార్యక్రమంలో భాగంగా NRC వద్దు అమరావతి ముద్దు అనే నినాదంతో ప్రజలకు సమాచారం అందించారు.
ఈ కార్యక్రమంలో వల్లెపు నాగేశ్వరరావు, బండరుపల్లి విశేశ్వరావు, మాజేటి వెంకటేష్, శ్రీను, ప్రసాద్, గురజాల నాగేశ్వరరావు, రఫీ, భాషా, పెరికల రాయప్ప, యాడ్స్ వలి, శేఖర్, మీరావలి, పోతురాజు, కొర్రపాటి శ్రీను, బంగారం, గోపి తదితరులు పాల్గొన్నారు.