సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అమరావతి ఐకాస స్పష్టం చేసింది. ఏకైక రాజధానిగా అమరావతినే కొనసాగించాలనే డిమాండ్తో సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అమరావతి ఐకాస వెల్లడించింది. రాజధాని ఐక్యకార్యాచరణ సమితి ఆధ్వర్యంలో ఈనెల 13 నుంచి నిరసన చేపట్టనున్నారు.
ఈనెల 13న రాయపూడిలో అమరావతి ఉద్యమ రంగవల్లిక
14న మందడంలో ఐకాస కార్యక్రమాలు, అమరావతి ఉద్యమ సెగలు పేరుతో బోగి మంటలు, అమరవీరులకు నివాళులు
15న తుళ్లూరులో రైతులు, మహిళల నిరసనలు, ఆంధ్రుల క్రాంతి కోసం అమరావతి సమర సంక్రాంతి పేరుతో నిరసనలు
15న వీధినాటకం, గాలిపటాలు, వంటా వార్పు
16న వెలగపూడిలో ‘అమరావతి వెలుగు’ పేరుతో నిరసనలు