నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ నియోజకవర్గంలోని మదాసి కురువలతో బిజెపి జిల్లా అధ్యక్షులు ఎల్లేని సుధాకర్ రావు భేటీ అయ్యారు. నియోజకవర్గంలో మాదాసి కురువలు ఎదుర్కొంటున్న సమస్యలను మదాసి కురువ ప్రముఖులతో కలిసి చర్చించారు. మాదాసి కురువలకు రాజ్యాంగబద్ధంగా రావలసిన SC సర్టిఫికేట్లను ఈ ప్రభుత్వాలు ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాయని మాదాసి కురువలను రాజకీయ పార్టి లు కేవలం ఒక ఓటు బ్యాంకు గా మాత్రమే వాడుకుంటున్నాయని మదాసి కురువ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.
ఎల్లేని సుధాకర్ రావు మాట్లాడుతూ మాదాసి కురువల పోరాటం న్యాయబద్ధమైనది అని,రాజ్యాంగ ప్రకారం వారికి రావలసిన SC సర్టిఫికెట్లను ఇవ్వకుండా ఈ ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, మాదాసి కురువ పోరాటానికి తన మద్దతు ఎప్పుడూ ఉంటుందని వారి సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని వారికి SC సర్టిఫికెట్ ను ఇచ్చేంత వరకు వారి తరపున పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు.
మాదాసి కురువ ల ఆచార సంప్రదాయాలు చాలా పురాతనమైనవి అని, డోలు కొట్టడం, గజ్జ కట్టడం, వంటి కళలకు ప్రాధాన్యతను ఇప్పించడం కోసం తన వంతు సహకారం చేస్తానని, ఈ కళలకు గుర్తింపు తెచ్చే విధంగా సంస్కృతిక పర్యటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తామని, అదేవిధంగా కొల్లాపూర్ నియోజక వర్గంలో ఉన్నటువంటి మాదాసి కురువల యొక్క కళలను ప్రోత్సహించే విధంగా,కృషి చేస్తామని వారు తెలిపారు.
అంతే కాకుండా త్వరలోనే కొల్లాపూర్ నియోజకవర్గం లో ఉన్నమదాసి కురువలకు డోలు కొట్టడంలో పోటీలను నిర్వహించి పోటీల్లో గెలుపొందిన వారికి తగిన బహుమతులు ప్రదానం చేస్తామని తద్వారా కళలను ప్రపంచానికి తెలియ జేసే విధంగా చేస్తామని మాదాసి కురువ నాయకులకు సుధాకర్ రావు భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎల్లేని సుధాకర్ రావు తో పాటు మాదాసి కురువ నాయకులు ప్రముఖులు,పెద్ద మల్లయ్య ధర్మయ్య, బీరయ్య,పర్వతాలు ఇదన్న, శివ, సొంటే ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.