29.7 C
Hyderabad
May 3, 2024 06: 07 AM
Slider నల్గొండ

యాదవులకు రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గొఱ్ఱెలు పంపిణీ చేయాలి

#BJPSuryapet

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ఆదివారం బి‌జే‌పి పట్టణ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో బి‌జే‌పి సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు బొబ్బ భాగ్యరెడ్డి మాట్లాడుతూ యాదవులకు గొఱ్ఱెలు పంపిణీ చేయాలని, ఇప్పటికీ సుమారుగా 3,58,000  మంది 32,500 రూపాయలు డి‌డిలు కట్టి ఎదురు చూస్తున్నారని అన్నారు.

తక్షణమే వారందరికీ గొఱ్ఱెలు పంపిణీ చేయాలని అన్నారు. హుజూర్ నగర్ బై ఎలెక్షన్ ముందు గొఱ్ఱెలు పంపిణీ చేస్తామని, యాదవ సోదరులను ఓట్ల కోసం మభ్య పెట్టి, ఎన్నిక అయిపోయి ఒక సంవత్సరం దాటి నప్పటికి  నేటి వరకు పంపిణీ చేయలేదని అన్నారు.

వెంటనే సూర్యపేట జిల్లాలో యాదవ్ సోదరులకు గొఱ్ఱెలు పంపిణీ చేయాలని  డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో బి‌జే‌పి కోకన్వీనర్ బాల వెంకటేశ్వర్లు, బి‌జే‌పి పట్టణ నాయకులు రామరాజు, ఇంటి రవి, వల్లపుదాసు గోపి, కంటూ నాగరాజు, విజయ్, వీరబాబు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

రైతు బిడ్డనని చెప్పుకోవడానికి సంకోచించకండి

Satyam NEWS

విద్యాసంవత్సరం ముగిసినట్టే?

Sub Editor

సిబ్బంది కుటుంబాలకు బాసటగా పోలీసు భద్రత స్కీమ్

Satyam NEWS

Leave a Comment