26.7 C
Hyderabad
May 15, 2024 09: 06 AM
Slider ప్రత్యేకం

రికార్డు స్థాయిలో అయ్యప్పకు ఆదాయం

#ayyappa

శబరిమల లోని అయ్యప్ప దేవాలయంకు రికార్డు స్థాయిలో ఆదాయం లభించింది.  కేవలం 10 రోజుల్లోనే రూ.52 కోట్ల ఆదాయం సమకూరినట్లు ట్రావెన్ కోర్ దేవస్థానం ప్రకటించింది. అత్యధికంగా అరవణ ప్రసాదం విక్రయంతో రూ.23.57 కోట్లు, హుండీల ద్వారా రూ.12.73 కోట్లు, అప్పం అమ్మకాల ద్వారా రూ.2.58 కోట్లు వచ్చిందని దేవస్థానం వెల్లడించింది. గత ఏడాది ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.9 కోట్లే వచ్చిందని ట్రావెన్‌కోర్టు దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కే అనంత గోపన్‌ వెల్లడించారు.  వచ్చే 20 రోజులకు సరిపడా 51 లక్షల అరవణ ప్రసాదం డబ్బాలు ప్రస్తుతం నిల్వ ఉన్నాయని ట్రావెన్‌కోర్టు దేవస్థానం బోర్డు అధ్యక్షుడు కే అనంత గోపన్‌ తెలియజేశారు . రోజుకు సగటున రెండున్నర లక్షల డబ్బాల ప్రసాదాన్ని విక్రయిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాగా కరోనా కారణంగా గత రెండేళ్ల నుంచి భక్తుల సంఖ్యపై పరిమితి విధించడంతో ఆలయానికి ఆదాయం తగ్గిపోయింది. ఈ ఏడాది భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారని ముందుగానే ఊహించి అందుకు తగ్గట్లు అధికారులు ఏర్పాట్లు చేశారు. . టైమ్ స్లాట్ విధానం వల్ల భక్తులు ఎక్కువ సేపు నిరీక్షణ లేకుండా సన్నిధానంలోకి చేరుకుంటున్నారు.

Related posts

జగనన్నఇంటి పడికెట్ల స్లాబ్ కూలిపోవడంతో కార్మికుడు దుర్మరణం

Satyam NEWS

భారత్ బయోటెక్ కోవాక్సిన్ కు పూర్తి స్థాయి అనుమతి

Satyam NEWS

కరోనా ఎలర్ట్: గచ్చిబౌలి లో మరో క్వారంటైన్ సెంటర్

Satyam NEWS

Leave a Comment