కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గుండి గోపాలపేట గ్రామంలో సేవ్ ది లైఫ్ పౌండేషన్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. మొత్తం 35 మంది యువకులు రక్త దానం చేసిన ఈ కార్యక్రమం సదిశ సహకారం తో జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా రామడుగు మండల ఎస్సై తండ్రా వివేక్ పాల్గొని రక్త దాతలకు పండ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం అనంతరం సేవ్ ది ది లైఫ్ ఫౌండేషన్ ఫౌండర్ రాజ్ కుమార్ మాట్లాడుతూ కరోనా లాంటి కష్టకాలంలో 35 మంది రక్త దాతలు స్వచ్ఛందంగా రక్తదానం చేసినందుకు అభినందనలు తెలిపారు. దీనికి సదిశ ఫౌండేషన్ ఫౌండర్ గోవర్ధన్ కు, ప్రగతి హై స్కూల్ యజమానికి సేవ్ ది లైఫ్ ఫౌండేషన్ తరపున హృదయ పూర్వక అభినందనలు తెలియజేస్తున్నామని కూడా చెప్పారు. ప్రిన్సిపల్ వెంకట్ నారాయణ, స్కూల్ బోర్డ్ మెంబర్ మునిందర్, సేవ్ ది లైఫ్ ఫౌండేషన్ ఫౌండర్ రాజ్ కుమార్, చంద్రశేఖర్, అజయ్ నాని జవ్వజి సోషల్ మీడియా కోఆర్డినేటర్ సాయి తేజ, కర్ణాకర్, లక్ష్మణ్, రక్త దాతలు తదితరులు కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.