సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మఠంపల్లి మండల పరిధిలోని అల్లిపురం గ్రామంలో శ్రీ శీతల పరమేశ్వరి (బొడ్రాయి), అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన,ధ్వజస్తంభ ప్రతిష్టా కార్యక్రమాలు అత్యంత భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగాయి.
దేవాలయానికి రంగులు,అన్నదానం ఏర్పాటు చేసిన ఓజో ఫౌండేషన్ చైర్మన్ పిల్లుట్ల రఘు కు అల్లిపురం గ్రామ ప్రజలు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా రఘు మాట్లాడుతూ భగవంతుని ఆశీస్సులతో ప్రజలు సుఖ శాంతులతో, ఆయురారోగ్యాలతో,పాడి – పంటలతో, సకాలంలో వర్షాలు కురిసి రైతులు ఆనందంగా ఉండాలని అన్నారు.
అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని రఘు ప్రారంభించారు. గ్రామ ప్రజల కోరిక మేరకు దేవాలయానికి రంగులు,అన్నదానం ఏర్పాటు చేసినందుకు గ్రామస్తులు రఘు కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఓజో ఫౌండేషన్ ఇంచార్జ్ కుక్కల వెంకన్న,దేవాలయ చైర్మన్ మల్ రెడ్డి వీరారెడ్డి,ఓబుల్ రెడ్డి,కె.ఎన్.చారి,శివారెడ్డి,హనుమంతు, సాయిబాబా,శివశంకర్,అంజి,రామంజి గ్రామ ప్రజలు విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.