గ్రామదేవతలైన అమ్మవార్లను భక్తిశ్రద్ధలతో ఆరాదిస్తే అన్ని శుభాలే జరుగుతాయనీ రామంతపూర్ కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావు అన్నారు. ఆదివారం
రామంతపూర్. భరత్ నగర్ లోని శ్రీశ్రీ శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయ వార్షికోత్సవం చివరి రోజు శ్రీశ్రీశ్రీ రేణుక ఎల్లమ్మ జమదగ్ని మహాముని కళ్యాణ వేడుకలు కన్నుల పండువగ నిర్వహించారు.
ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా కార్పొరేటర్ బండారు శ్రీవాణి వెంకటరావు హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గ్రామదేవతలైన ఎల్లమ్మ, పోచమ్మ , మైసమ్మ , అమ్మవార్లను ఆరాధిస్తే దుష్టశక్తులు దూరమై అన్ని శుభాలే జరుగుతాయనీ అన్నారు, ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు బండారు వెంకట్రావు ప్రధాన కార్యదర్శిలు సంకూరి కురుమస్వామి ఉలుగొండ నారాయణదాసు, పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి