బాగ్ అంబర్ పేట డివిజన్ తురాబ్ నగర్ లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ వారి సొంత ఖర్చుతో నూతనంగా వేయిస్తున్న మంచి నీటి బోర్ పనులను శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే బస్తీలో పాదయాత్ర నిర్వహించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ముఖ్యంగా బస్తీలో కొన్ని చోట్ల వీధి దీపాలను, కొత్త విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయాలని, అలాగే బస్తీలో రోడ్డుకు దగ్గరగా ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ను వేరే చోటుకు మార్చాలని మరియు ఎత్తుగా పెరిగిన చెట్ల కొమ్మలను తొలగించాలనే సమస్యలను దృష్టికి తీసుకురాగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే వీలైనంత త్వరగా సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా అడిగిన వెంటనే స్పందించి సొంత ఖర్చుతో బోరు వేయించి నీటి సమస్యను పరిష్కరించిన ఎమ్మెల్యేకి తురాబ్ నగర్ బస్తీ వాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ కమిటీ వారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు
సత్యం న్యూస్, అంబర్పేట్