బోస్టన్ కమిటీ ఇచ్చిన నివేదిక పత్రాలను అమరావతి పరిరక్షణ కమిటీ (జేఏసీ) ఆధ్వర్యంలో భోగి మంటల్లో వేసి కాల్చేశారు. నరసరావుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఈ కార్యక్రమానికి నేతృత్వం వహించారు.
3 రాజధానుల నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాజధాని గా అమరావతిని మాత్రమే కొనసాగించాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రజల నుంచి ఎటువంటి అభిప్రాయాలు సేకరించకుండా బోగస్ నివేదిక అందజేసిన ఈ కమిటీలు ఇచ్చిన నివేదికలు బోగి మంటలకు మాత్రమే పనికి వస్తాయని డాక్టర్ చదలవాడ అన్నారు.
నరసరావుపేట పట్టణంలో స్థానిక 27 వ వార్డు లోని శివుని బొమ్మ సెంటర్ లోని మహాలక్ష్మమ్మ చెట్టు వద్ద ఈ కార్యక్రమాన్ని పెద్దఎత్తున నిర్వహించి తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చదలవాడ అరవింద బాబు తోబాటు 27 వ వార్డు ప్రెసిడెంట్ కాకుమాను వెంకట్రావు, కోడూరు రాము, 29 వ వార్డ్ ప్రెసిడెంట్ వనమా పవన్ కుమార్ వార్డ్ లోని కార్యకర్తలు అందరూ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి కొనసాగించాలని నరసరావుపేట జేఏసి ముక్త కంఠంతో డిమాండ్ చేసింది.