కశ్మీర్లో అల్లర్లు జరుగుతున్నాయని అక్కడ ఇంటర్ నెట్ నిలిపివేశారని వార్తలు చదివి తెలంగాణ ప్రజలు ఇలా కూడా జరుగుతుందా అని ఆలోచించేవారు.కానీ ఇప్పుడు ప్రత్యక్షం గాతెలంగాణ లోనే ఈ పరిస్థితిని చూసి ఔరా అనుకుంటున్నారు.పోలీస్ లు శాంతి భద్రతల దృష్ట్యా ఉత్తర తెలంగాణలో నాలుగు జిల్లాల్లో ఇంటర్నెట్ను నిషేధించారు.భైంసాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితి దృష్టిలో ఉంచుకుని అక్కడ సుమారు రెండు బెటాలియన్ల మేర రాపిడ్ యాక్షన్ ఫోర్స్, సీఆర్పీఎఫ్ సిబ్బందిని మోహరింపజేశారు.
ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా . నిర్మల్, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లాల్లో వదంతులు వ్యాపించకుండా ఇంటర్నెట్ ఆపేశారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లపై పోలీసులు నిఘా ఉంచారుఈ ఆందోళన వల్ల ఉద్రిక్త పరిస్థితులు మరింత తీవ్రతరమౌతాయనే అనుమానంతో పోలీసులు ముందు జాగ్రత్తలు చేపట్టారు.భైంసాలో 144 సెక్షన్ విధించారు.
రాజాసింగ్ను గృహ నిర్బంధంలో
రాజాసింగ్ను గృహ నిర్బంధంలో ఉంచారు. భైంసాలో రెండు వర్గాల మధ్య తలెత్తిన ఓ చిన్న గొడవ.. తీవ్రరూపం దాల్చిన విషయం తెలిసిందే. ఒక వర్గం వారి నివాసాలపై మరొక వర్గం వారు దాడులు చేశారు. ప్రతిదాడులకు దిగారు. ఈ ఘటన అనంతరం పోలీసులు భైంసాలో 144 సెక్షన్ను విధించారు. ఫలితంగా పరిస్థితిని అదుపులోకి వచ్చింది.
తెలంగాణ భారతీయ జనతా పార్టీ శాసన సభ్యుడు రాజాసింగ్ను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. నిర్మల్ జిల్లాలోని భైంసా వెళ్లడానికి ఆయన చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. ఛలో భైంసా ఆందోళనను భగ్నం చేశారు. సోమవారం రాత్రి భైంసాలో చోటు చేసుకున్న అల్లర్లు, రెండు వర్గాల మధ్య సంభవించిన దాడులు, ప్రతిదాడులకు నిరసనగా ఆయన ఛలో భైంసాకు పిలుపునిచ్చారు.