రాయదుర్గం పీఎస్ పరిధిలో తీవ్ర విషాద ఘన జరిగింది. రాయదుర్గం పీఎస్ పరిధిలోని చిత్రపురి కాలనిలో జరిగిన ఈ విషాద సంఘటనలో అనూహ్యంగా ఒక బాలుడు మరణించాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ఆందోళన కలిగిస్తున్నది. చిత్రపురి కాలనిలో 5-6 బ్లాక్ మధ్యలో కూర్చొని ఆడుకుంటున్న పిల్లల పైకి సెల్లార్ నుండి పైకి వచ్చిన కారు ఎక్కింది. జీవాన్ష్ అనే బాలుని తలకు తాకుతూ కారు వెళ్లింది.
దాంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. సాయి౼శ్రావణి దంపతుల కుమారుడే జీవాన్ష్. వారు చిత్రపురి HIG-5- 705 లో నివాసంలో ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో HIG లో మెంటనెన్స్ మేనేజర్ గా బాలుడి తండ్రి సాయి పని చేశాడు. ఇటీవలే బాలుడి తండ్రి సాయి మృతి చెందడంతో తీవ్ర విషాదంలో ఆ కుటుంబం ఉన్నది. ఇంటి పెద్దను కోల్పోయి దుఃఖ సాగరంలో ఉన్న కుటుంబానికి మరో దెబ్బ తగిలింది. భర్తను కోల్పోయి… కొడుకే దిక్కు అనుకున్న తల్లి శ్రావణి బాధ వర్ణతీతం.