31.2 C
Hyderabad
May 3, 2024 01: 24 AM
Slider హైదరాబాద్

ఆడుకుంటున్న బాలుడిపైకి వెళ్లిన కారు

#chitrapuri

రాయదుర్గం పీఎస్ పరిధిలో తీవ్ర విషాద ఘన జరిగింది. రాయదుర్గం పీఎస్ పరిధిలోని చిత్రపురి కాలనిలో జరిగిన ఈ విషాద సంఘటనలో అనూహ్యంగా ఒక బాలుడు మరణించాడు. ఆలస్యంగా వెలుగు చూసిన ఈ ఘటన ఆందోళన కలిగిస్తున్నది. చిత్రపురి కాలనిలో 5-6 బ్లాక్ మధ్యలో కూర్చొని ఆడుకుంటున్న పిల్లల పైకి సెల్లార్ నుండి పైకి వచ్చిన కారు ఎక్కింది. జీవాన్ష్ అనే బాలుని తలకు తాకుతూ కారు వెళ్లింది.

దాంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతడిని ఆస్పత్రికి తరలించారు. సాయి౼శ్రావణి దంపతుల కుమారుడే జీవాన్ష్. వారు చిత్రపురి HIG-5- 705 లో నివాసంలో ఉంటున్నారు. ఈ మధ్య కాలంలో HIG లో మెంటనెన్స్ మేనేజర్ గా బాలుడి తండ్రి సాయి పని చేశాడు. ఇటీవలే బాలుడి తండ్రి సాయి మృతి చెందడంతో తీవ్ర విషాదంలో ఆ కుటుంబం ఉన్నది. ఇంటి పెద్దను కోల్పోయి దుఃఖ సాగరంలో ఉన్న  కుటుంబానికి మరో దెబ్బ తగిలింది.  భర్తను కోల్పోయి… కొడుకే దిక్కు అనుకున్న తల్లి శ్రావణి బాధ వర్ణతీతం.

Related posts

జగన్ కుట్రలు చేదిస్తాం .. కుతంత్రాల వైకాపా ను తరిమేస్తాం

Bhavani

Sale Monster Test Pills

Bhavani

వెన్నుపోటు వైసీపీ నాయకులకు వెన్నతో పెట్టిన విద్య

Satyam NEWS

Leave a Comment