సూర్యాపేట జిల్లా హుజుర్ నగర్ మునిసిపాలిటీ పరిధిలోని దద్దనాల చెఱువు 1వ,వార్డులో నివాసం ఉంటున్న తిరగమళ్ళ పుష్పమ్మ అనే వృద్దురాలు తీవ్ర ఇబ్బందులతో సతమతం పడుతున్న విషయం జనచైతన్య ట్రస్ట్ సభ్యుల దృష్టికి రావడంతో జనచైతన్య ట్రస్ట్ తరుపున ఆదివారం 25 కేజీల బియ్యం,నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా జనచైతన్య ట్రస్ట్ సభ్యులు మాట్లాడుతూ సమాజంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న వారికి తమవంతు బాధ్యతగా జన చైతన్య ట్రస్ట్ ద్వారా ఆదుకునేందుకు,సహాయ సహకారాలు అందించడానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జనచైతన్య ట్రస్ట్ పౌండర్ పినపారాళ్ళ వంశీ,అధ్యక్షుడు పారా సాయి,ఉపాధ్యక్షుఊ పిల్లి శివశంకర్, ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి రమేష్,బి.వి. శ్రీపతి,కాశీవిశ్వనాథ్,రమేష్,జయంత్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్