ఉప్పల్ నియోజకవర్గ కాప్రా సర్కిల్ మీర్పేట్ హౌసింగ్ బోర్డ్ కాలనీ కైలాసగిరి రంగనాథ స్వామి ఆలయంలో డాక్టర్ ధనుంజయ ఆధ్వర్యంలో బ్రాహ్మణ కులస్తుల కొత్త సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బి ఎల్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ , బి ఆర్ ఎస్ రాష్ట్ర నాయకులు బండారి లక్ష్మారెడ్డి , ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి హాజరయ్యి క్యాలెండర్ ఆవిష్కరణ చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్ బి కాలనీ కార్పొరేటర్ ప్రభుదాస్, మల్లాపూర్ కార్పొరేటర్ పన్నాల దేవేందర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ శ్రీనివాస్ రెడ్డి మరియు బి ఆర్ ఎస్ యువ నాయకులు జంపాల్ రెడ్డి, దూసరి నవీన్ గౌడ్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
సత్యంన్యూస్.నెట్, మేడ్చల్ జిల్లా