అవయవ దానం చేసిన ఒక వ్యక్తి అమరుడైన సంఘటన శ్రీకాకుళం జిల్లాలో జరిగింది. శ్రీకాకుళం జెమ్స్ హాస్పిటల్ లో బ్రెయిన్ డెడ్ పేషెంట్ పి.రాజేశ్వరరావు(62) కుటుంబ సభ్యులు అవయవదానానికి ముందుకు వచ్చి అవసరంలో ఉన్న మరో ఇద్దరిని బతికించారు. మెదడులోని రక్త నాళాలు చిట్లి ఈనెల 14న జెమ్స్ హాస్పిటల్ లో రాజేశ్వరరావు జాయిన్ అయ్యారు. గత ఐదు రోజులుగా వైద్యులు వెంటిలేటర్ పై చికిత్స అందించారు. అయితే రాజేశ్వరరావు చికిత్సకు ఏమాత్రం స్పందించ లేదు. ఈ దశలో రాజేశ్వరరావు కుటుంబసభ్యులకు అవయవ దానంపై వైద్యులు కౌన్సిలింగ్ ఇచ్చారు. కుటుంబ సభ్యులు ముందుకు రావటంతో గుండెను తిరుపతి స్విమ్స్ కి,లివర్ ను విశాఖలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించారు. గుండెను జెమ్స్ హాస్పిటల్ ప్రాంగణం నుండి హెలికాప్టర్ ద్వారా విశాఖ ఎయిర్పోర్ట్ కి తరలించారు. అవయవదానం చేసిన రాజేశ్వరరావుకు హాస్పిటల్ వైద్యులు,సిబ్బంది ఘన నివాళులర్పించారు. రాజేశ్వరరావు స్వగ్రామం టెక్కలి మండలం రావివలస. జెమ్స్ హాస్పిటల్ కేంద్రంగా ముప్పై రోజుల వ్యవధిలో అవయవదానంకి ముందుకు వచ్చిన ముగ్గురు బైయిన్ డెడ్ పేషంట్ల కుటుంబాలు ఉండటం గమనార్హం.
next post