జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలంలోని మల్లూరు, మల్లూరు తండా,జక్కాపూర్, వడ్డేపల్లి, మాగి, గోర్గల్, సుల్తాన్ నగర్, (బంజపల్లి)నిజాంసాగర్ గ్రామాలలో భారత రాష్ట్ర సమితి అభ్యర్థి హనుమంత్ షిండే మంగళవారం తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు ఆయా గ్రామాల ప్రజలు బ్యాండ్ మేళాలతో ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా షిండే మాట్లాడుతూ జుక్కల్ నియోజకవర్గానికి ఇప్పటివరకు ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలను తన హయాంలో పూర్తిగా కొనసాగించానని, ఇతర జిల్లాల నుండి వచ్చిన నాయకుల మోసపూరిత హామీలను నమ్మవద్దన్నారు. నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను ఇక్కడి బాధలు, సమస్యలు తనకే పూర్తిగా తెలుసు అన్నారు. వారు సుగ్గీ వారు మాత్రమే అన్నారు. జుక్కల్ నియోజకవర్గం ప్రజలు అమాయకులని వీరిని మోసం చేయడమే వారి ధ్యేయంగా ఇక్కడికి వచ్చి పోటీ చేస్తున్నారని ఆక్షేపించారు. వారిని చిత్తుచిత్తుగా ఓడించి, స్థానికుడైన అభ్యర్థిగా పోటీలో ఉన్నానని, బిఆర్ఎస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను దృష్టిలో పెట్టుకుని కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు. కార్యక్రమంలో ఆయనతోపాటు మాజీ జెడ్పి చైర్పర్సన్ దఫెదర్ రాజు, పట్లోళ్ల దుర్గారెడ్డి, బి.ఆర్.ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.
జి.లాలయ్య సత్యం న్యూస్ జుక్కల్ నియోజకవర్గం