37.2 C
Hyderabad
May 6, 2024 11: 26 AM
Slider నిజామాబాద్

షర్మిల పాదయాత్ర చేస్తే బీఆర్ఎస్ కు వణుకు

#ysrtp

వైఎస్ఆర్టిపి అధినేత వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తుంటే బీఆర్ఎస్ నేతలకు వణుకు పుడుతుందని వైఎస్ఆర్టిపి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నీలం సుధాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నీలం సుధాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ.. టిఆర్ఎస్ నాయకులు పాదయాత్రను చూసి తట్టుకోలేకపోతున్నారన్నారు. బీఆర్ఎస్ నాయకులకు మహిళల పట్ల కనీస మర్యాద లేదని పేర్కొన్నారు. షర్మిల అరెస్టును ఖండించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గ యూత్ అధ్యక్షులు పెద్ద పోతన్న గారి రాము, పట్టణ అధ్యక్షులు ఎండి తాహేర్, నాయకులు సంగమేశ్వర్, శ్రీనివాస్, రాజు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Related posts

వ్యర్ధాలపై విజ‌య‌న‌గ‌రంలో అవ‌గాహ‌న‌ ర్యాలీ

Sub Editor

కేసీఆర్ కుటుంబం, చెంచాల కోసమే ధరణి: ఈటల రాజేందర్

Satyam NEWS

పిల్ల‌ల‌ను పెంచ‌డంలో అమ్మ‌తో పాటు నాన్న పాత్ర కూడా కీల‌కం…!

Satyam NEWS

Leave a Comment