వైఎస్ఆర్టిపి అధినేత వైఎస్ షర్మిల పాదయాత్ర చేస్తుంటే బీఆర్ఎస్ నేతలకు వణుకు పుడుతుందని వైఎస్ఆర్టిపి కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు నీలం సుధాకర్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నీలం సుధాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడుతూ.. టిఆర్ఎస్ నాయకులు పాదయాత్రను చూసి తట్టుకోలేకపోతున్నారన్నారు. బీఆర్ఎస్ నాయకులకు మహిళల పట్ల కనీస మర్యాద లేదని పేర్కొన్నారు. షర్మిల అరెస్టును ఖండించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి నియోజకవర్గ యూత్ అధ్యక్షులు పెద్ద పోతన్న గారి రాము, పట్టణ అధ్యక్షులు ఎండి తాహేర్, నాయకులు సంగమేశ్వర్, శ్రీనివాస్, రాజు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.