ఎన్నిక ఏదైనా, గెలుపు మనదే, ప్రజల సంపూర్ణ మద్దతు కూడా బిఆర్ఎస్ కే అని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వరంగల్ ఉర్సుగుట్ట రంగలీలా మైదానం రావణ వధ,దసరా ఉత్సవాలకు హాజరైన ఆయన ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ పసునూరి దయాకర్, మేయర్ గుండు సుధారాణి,ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్,సిపి తరుణ్ జోషి తదితరులు కూడా పాల్గొన్నారు.
విజయదశమి రోజున రాముడు రావణుని పై గెలిచిన సందర్భమే కాక, పాండవులు వనవాసం వెళ్తూ జమ్మి చెట్టు పై తమ ఆయుధాలను తిరిగి తీసిన రోజు. సందర్భంగా రావణ వధ, జమ్మి ఆకుల పూజా చేస్తుంటారు. జగన్మాత అయిన దుర్గా దేవి, మహిషాసురుడనే రాక్షసునితో 9 రాత్రులు యుద్ధము చేసి అతనిని చంపి జయాన్ని పొందిన సందర్భమున 10వ రోజు ప్రజలంతా సంతోషముతో పండగ జరుపుకున్నారు. అదే ప్రస్తుతం మనం జరుపుకుంటున్న విజయదశమి అని ఆయన అన్నారు. పురాణ గాథలను బట్టి చెడు పై మంచి సాధించిన విజయం అని అన్నారు. ఎన్నో ఆటంకాలను అధిగమించి కెసిఆర్ తెలంగాణ సాధించారని, తెచ్చుకున్న తెలంగాణ తెర్లు కాకుండా కాపాడుతూ, బంగారు తెలంగాణ చేస్తున్నారని ఆయన అన్నారు. అభివృద్ధి సంక్షేమం విడనాడకుండా కరోనా కష్ట కాలం లో సైతం ప్రజలను అన్ని విధాలుగా ఆదుకున్నారని మంత్రి తెలిపారు.