42.2 C
Hyderabad
April 30, 2024 16: 32 PM
Slider ఆదిలాబాద్

స్కాములతో రాష్ట్రాన్ని అభాసు పాలు చేస్తున్న బీ ఆర్ ఎస్

#golevenkatesham

మాయమాటలతో ప్రజలను మోసం చేసే ఘనుడు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అని భాజాపా ఓబీసీమోర్ఛా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గోలెం వెంకటేశం విమర్శించారు. ప్రజాధనాన్ని నిలువునా దోచుకోవడం, భూములను ఆక్రమించుకోవడం, కబ్జాలు చేయడం, ప్రజాధనాన్ని కాంట్రాక్టర్ల పేరుతో కమిషన్ల పేరుతో కొల్లగొట్టడం బీ ఆర్ ఏస్ పార్టీ నాయకులకు అలవాటైపోయిందని ఆయన అన్నారు. తెలంగాణ మిగులు రాష్ట్రంగా ఉందేదని, దాన్ని  అప్పుల రాష్ట్రంగా మార్చిన ఘనులు బీఆర్ఎస్ పార్టీ నాయకులేనని ఆయన అన్నారు.

80 వేల పుస్తకాలు చదివినట్లు చెప్పుకునే ముఖ్యమంత్రి హయాంలో ప్రతి పరీక్ష పేపరు లీక్ అవుతూనే ఉన్నాయని, రాష్ట్రంలో ఏ పరీక్ష నిర్వహించిన ప్రతిదీ పరీక్ష పేపర్ లీకవడం ఆ పరీక్ష తేదీలను వాయిదా వేయడం విద్యార్థులను మోసం చేసి రోడ్డుమీద పడేయడం జరుగుతోందని అన్నారు. రాష్ట్రంలో విద్యారంగం చూసినా, వైద్యరంగం చూసినా స్కాముల రాష్ట్రంగా మార్చి దేశంలోని ఇతర రాష్ట్రాల ముందు తలెత్తుకోలేని పరిస్థితికి దిగజార్చారని ఆయన అన్నారు. బంగారు తెలంగాణా అని చెప్పుకునే ముఖ్యమంత్రి స్కాములతో దోచుకునే బి ఆర్ఎస్ నాయకుడేనని అన్నారు.

ఎక్కడా అభివృద్ధి చెందిన దాఖలాలు లేవు కేంద్రం నిధులు దారి మళ్లించి పేర్లు మార్చి కేంద్రం ఇచ్చే నిధులను కూడా దోచుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రపంచంలోనే  నెంబర్ వన్ నాయకునిగా పేరుగాంచిన నరేంద్ర మోడీ చదువు విషయాన్ని సంస్కారహీనులైన వారు అడుగుతున్నారు. భారతదేశానికి ఒక సైనికుని లాగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారత ఆర్థిక వ్యవస్థను సమానంగా నిలిపిన నరేంద్ర మోడీ చదువు విషయం ఎందుకని ఆయన అన్నారు.

Related posts

ఎన్నారై టీడీపీ నేతల నిత్యావసర వస్తువుల పంపిణీ

Satyam NEWS

జగనన్న భవిష్యత్తు కాదు… సామాన్య ప్రజలకు విపత్తు

Satyam NEWS

మానవత్వాన్ని చాటుకున్న ఆర్య వైశ్యులు

Satyam NEWS

Leave a Comment