స్వర్గీయ నందమూరి తారకరామారావు 98వ జయంతి సందర్భంగా రాజమండ్రిలో ఎన్నారై టిడిపి వారి సౌజన్యంతో టీడీపీ సీనియర్ నాయకుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఆధ్వర్యంలో పేదలకు నిత్యావసర వస్తువులు అందచేశారు. ముందుగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళి అర్పించారు.
కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన నిరుపేద కుటుంబాలకు ఈ సందర్భంగా నిత్యావసర సరుకులు అందజేశారు. ఎన్నారైలు చేస్తున్న ఈ మంచి కార్యక్రమాన్ని గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభినందించారు.