29.7 C
Hyderabad
May 2, 2024 04: 14 AM
Slider ప్రత్యేకం

త్వరలో ఏపి  విశాఖ లో బిఆర్ యస్ సభ

#cmkcr

బిఆర్ఎస్‌ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లో బహిరంగ సభను నిర్వహించాలని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. తొలుత విశాఖపట్నంలో బహిరంగ సభ నిర్వహించే అవకాశం ఉందని ఏపీ బీఆర్ఎస్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ తెలిపారు. త్వరలోనే ఇందుకు సంబంధించిన తేదీని కేసీఆర్ ఖరారు చేయనున్నట్టుగా చెప్పారు. ఏపీ నుంచి చాలా మంది పెద్ద పెద్ద నేతలు తమను సంప్రదిస్తున్నారని.. భారీగా బీఆర్ఎస్‌లోకి చేరికలు జరుగుతున్నాయని అన్నారు. తెలంగాణ ప్రగతిని దేశానికి పరిచయం చేస్తామని చెప్పారు. దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ పాత్ర కీలకం కాబోతుందని ధీమా వ్యక్తం చేశారు. ఏపీలో బీఆర్ఎస్.. సీఎం జగన్ ప్లాన్ బీ అంటున్న బీజేపీ, టీడీపీ మాటలకు అర్థం లేదని అన్నారు. ఏపీలో కూడా ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ పోరాటం చేస్తుందని చెప్పారు.

బీఆర్ఎస్‌తో జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్న.. తొలుత మరో తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌పై దృష్టిసారించారు. ఇప్పటికే ఏపీకి చెందిన తోట చంద్రశేఖర్, రావెల కిషోబాబుతో పాటు పలువురు బీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఆ సమయంలోనే బీఆర్ఎస్ ఏపీ అధ్యక్షునిగా తోట చంద్రశేఖర్‌ను కేసీఆర్ నియమించారు. బీఆర్ఎస్‌లో ఏపీ నుంచి పెద్ద సంఖ్యలో చేరికలు ఉంటాయని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఏపీలో పార్టీ విస్తరణపై వేగం పెంచిన కేసీఆర్.. విజయవాడలో బీఆర్ఎస్ ఆఫీసు ఏర్పాటు చేసేందుకు కూడా ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఇటీవల సంక్రాంతి సందర్భంగా కూడా ఏపీలో కొన్ని చోట్ల బీఆర్ఎస్ ఫ్లెక్సీలు దర్శనమిచ్చాయి. ఇక, తొలుత విజయవాడలోనే బీఆర్ఎస్ సభ ఉంటుందని అనుకున్నప్పటికీ.. ఏపీలో బీఆర్ఎస్ తొలి సభను విశాఖలో నిర్వహించే ఆలోచనలో కేసీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది.

Related posts

Patanjali High Cholesterol Medicine

Bhavani

మధ్యాహ్న భోజన పథకం కార్మికులకు వేతనాలు ఇవ్వాలి

Satyam NEWS

వైసీపీ నేతల కనుసన్నల్లోనే సాగుతున్న గంజాయి మాఫియా

Satyam NEWS

Leave a Comment