29.7 C
Hyderabad
May 1, 2024 09: 38 AM
Slider గుంటూరు

వైసీపీ నేతల కనుసన్నల్లోనే సాగుతున్న గంజాయి మాఫియా

#nallapatiramu

రాష్ట్రంలో గంజాయి మాఫియా మొత్తం వైసీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతోందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి నల్లపాటి రాము అన్నారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో విపరీతంగా  గంజాయి సంస్కృతి పెరిగిపోయిందని ఆయన అన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేట తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారంనాడు జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

దేశంలో ఎక్కడ గంజాయి పట్టుబడినా దాని మూలాలు మొత్తం ఆంధ్రప్రదేశ్ లోనివే అని అధికారులు నిర్ధారణ చేస్తున్నారని ఆయన అన్నారు. అయిన ఏ ఒక్క వ్యక్తి ని అరెస్ట్ చేయడం లేదని, కేసులు నమోదు చేయడంలేదని ఆయన అన్నారు. ఎంతో తీవ్రమైన సమస్యల్లో కొట్టుమిట్టాడుతున్న రాష్ట్రాన్ని గాలికి వదిలేసిన జగన్ తనను ఎవరూ ఏం పీకలేరంటూ అసభ్య పదజాలాన్ని పిల్లల ముందు ఉపయోగిస్తున్నారని నల్లపాటి రాము ఆవేదన వ్యక్తం చేశారు.

వచ్చే ఎన్నికల లోపు చంద్రబాబు నాయుడుకి హార్డ్ ఎటాక్ రావాలని జగన్ కోరుకోవడం సిగ్గు చేటని ఆయన అన్నారు. చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో మళ్ళీ టీడీపీ అధికారంలోకి వస్తుంది కాబట్టి… వచ్చిన తరువాత విచారణ జరిపి అందరిని జైలుకు పంపుతాడనే భయం వైసీపీ నేతలలో కనపడుతుందని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి జగన్ సొంత బాబాయి, మాజీ మంత్రి వై ఎస్ వివేకానందరెడ్డిని ఎవరు హత్య చేశారో అందరికి తెలుసునని రాము అన్నారు.

ఎం.ఎస్.సుధాకర్, సత్యంన్యూస్.నెట్, పల్నాడు జిల్లా

Related posts

ఖమ్మం జిల్లాలో పోటెత్తుతున్న వరద నీరు

Satyam NEWS

చలో ఇందిరా పార్క్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

Satyam NEWS

ఇరిగేష‌న్ అధికారుల‌పై మంత్రి ఆగ్రహం..!

Sub Editor

Leave a Comment