కేంద్ర ప్రభుత్వం సామాన్యులపై పెను భారం మోపుతోందని, బీజేపీ పాలనలో నిత్యావసరాల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్ మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్ ధరకు నిరసనగా భారత రాష్ట్ర సమితి పార్టీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు ములుగు పట్టణ కూడలిలో నిరసన ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ములుగు జిల్లా టిఆర్ఎస్ నాయకులు ప్రజా ప్రతినిధులు కట్టెల పొయ్యి పై వంట వండి,గ్యాస్ సిలిండర్లతో నిరసన వ్యక్తం చేశారు.
పెద్ద ఎత్తున మహిళ నాయకులు తరలివచ్చి కట్టెల పొయ్యి వెలిగించి వంటావార్పుతో నిరసన ధర్నా చేపట్టారు. అనంతరం ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్ మాట్లాడుతూ సిలిండర్ ధరలు పెంచి కేంద్రం పేదల నడ్డి విరుస్తోందన్నారు. వెంటనే పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలని డిమాండ్ చేశారు. రూ. 1175 రూపాయలతో గ్యాస్ కొనడం దారుణం అన్నారు.
నల్లధనం వెలికి తీస్తానని గతంలో చెప్పిన మోడీ నేటికీ తీసింది లేదు అని, 15 లక్షలు అకౌంట్లో వేసింది లేదు అన్నారు. వేల కోట్ల విలువ చేసే ఆస్తులను మోడీ అమ్మకానికి పెట్టడం దారుణం అన్నారు.అంతేకాక పెట్రోల్, డీజిల్, నిత్య అవసరాల ధరల పెంపుతో సామాన్యుల జీవితం ప్రశ్నార్థకంగా మారిందని మండిపడ్డారు. మోడీ పాలనలో బలిసినొడు ఇంకా ధనవంతుడు అవుతున్నాడని, పేదవాడు ఇంకా పేదవాడిగా మిగిలిపోతున్నాడని విమర్శంచారు.
అధానికి నష్టం వాటిల్లిందని గ్యాస్ ధరలకు పెంచడం దారుణమని అన్నారు. దేశంలో ఏ టెండర్ పడ్డ గుజరాత్ కంపెనీకె అప్పజెప్పుతుంది మోడీ ప్రభుత్వం అన్నారు. నీచ నికృష్టమైన పరిపాలన దేశంలో కొనసాగుతుందన్నారు. పొద్దున లేస్తే కేసీఆర్ ను, ప్రభుత్వాన్ని తిట్టడమే బీజేపీ నాయకుల పనిగా మారిందన్నారు. బిజెపిని గద్దె దించేందుకే కేసీఆర్ బీఆర్ఎస్ ని స్థాపించడం జరిగిందన్నారు. పెద్ద పెద్ద కంపెనీలను చేజిక్కించుకొని కేంద్ర ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో ములుగు మండల అధ్యక్షుడు బాదం ప్రవీణ్ తో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద నాయక్ ములుగు జడ్పిటిసి సకినాల భవాని ములుగు ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు పోరిక విజయరామ్ నాయక్ ములుగు పట్టణ అధ్యక్షుడు చెన్న విజయ్ నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు కోగీల మహేష్ ఎంపీటీసీలు ఇండ్ల రాజు మాచర్ల ప్రభాకర్ జన్నారపు శ్రీను ఆత్మ కమిటీ చైర్మన్ చందా చక్రపాణి సర్పంచుల ఫోరం అధ్యక్షుడు భూక్య పాప ములుగు మండల యూత్ అధ్యక్షుడు బైకానీ సాగర్ ములుగు మైనారిటీ విభాగం అధ్యక్షుడు రాజా హుస్సేన్ అంకుస్ నాజర్ ఖాన్ మరియు బుల్లెట్ ఓదేలు ఆత్మ కమిటీ డైరెక్టర్ గడ్డమీది భాస్కర్ మేడారం ట్రస్ట్ బోర్డ్ డైరెక్టర్ ఆదిరెడ్డి సీనియర్ నాయకులు వేల్పూరి సత్యనారాయణ మహమ్మద్ ఖాసిం గజ్జి నగేష్ కాసిందేవిపేట గ్రామ అధ్యక్షుడు భూక్య అమర్ సింగ్ సర్వాపూర్ గ్రామ అధ్యక్షుడు అప్పాజీ ఐలయ్య వార్డు మెంబర్ బల్గూరి నవీన్ మాదం మాదం సాగర్ తదితర టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.