టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ట్వీట్: 151 అసెంబ్లీ స్థానాలు గెలుచుకున్నాం అంటూ బీరాలు పలికి 8 నెలలు పూర్తికాక ముందే సంతలో పశువుల్లా ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలను కొని ఫోటోలకు ఫోజులిచ్చాడు జగన్ గారు. మూడు ముక్కలాట ఆడబోయి మండలిలో బొక్క బోర్లా పడుతున్నాం అని పసిగట్టి ఏ2 విజయసాయి రెడ్డి ని రంగంలోకి దింపి మండలి సాక్షిగా బేరసారాలకు మొదలుపెట్టారు.
మండలి గ్యాలరీలో కూర్చొని ఏ2 తో హార్స్ ట్రేడింగ్ చేయించాడు. 2 ఎమ్మెల్సీలను కొనుక్కొని వైకాపా కండువా కప్పే దుస్థితికి జగన్ దిగజారిపోయాడు అంటేనే అతని పాలన ఎంత అధ్వానంగా ఉందో అర్ధం అవుతుంది. 151 స్థానాలు గెలిచిన వ్యక్తిని ఇద్దరు ఎమ్మెల్సీలను కొనే నీచ స్థాయికి తీసుకొచ్చిన ఘనత మీకే దక్కుతుంది విజయసాయి రెడ్డి గారు