బాలివుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు హత్య బెదిరింపులు వచ్చినప్పటి నుండి తన భద్రత విషయంలో అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. అతను తన భద్రతలో ఎలాంటి లోపాన్ని అనుమతించడంలేదు. అంతే కాకుండా సల్మాన్ ఖాన్ తన భద్రతను పెంచుకున్నాడు.
దాని కోసం అతను తన కారును అప్గ్రేడ్ చేసాడు. అతను ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ అయిన ల్యాండ్ క్రూయిజర్ను కొనుగోలు చేశాడు. కారులో బుల్లెట్ ప్రూఫ్ గ్లాసెస్ కూడా అమర్చారు. అయితే, ఇది ల్యాండ్ క్రూయిజర్ కొత్త వెర్షన్ కాదు. కేవలం అతన ప్రత్యేక ఏర్పాట్లు చేసుకున్నాడు.
గత నెలలో సల్మాన్ ఖాన్కు హత్య బెదిరింపులు వచ్చాయి. ఈ బెదిరింపు లేఖను జైలులో ఉన్న గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్కు పంపిందని ఆరోపణలు ఉన్నాయి. సల్మాన్ ఖాన్ ఆయుధం కలిగి ఉండటానికి లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకున్నాడు.
ఇప్పుడు భద్రత దృష్ట్యా కారును కూడా అప్గ్రేడ్ చేశారు. బెదిరింపు లేఖ రావడంతో సల్మాన్ ఖాన్ స్వీయ రక్షణ కోసం ఆయుధ లైసెన్స్ కోసం ఇటీవల ముంబై పోలీస్ కమిషనర్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నట్లు ముంబై పోలీసులు గతంలో తెలియజేసారు.
జూన్ 5న సల్మాన్ ఖాన్, అతని తండ్రి సలీం ఖాన్కు బెదిరింపు లేఖ వచ్చింది. బాంద్రాలోని బ్యాండ్స్టాండ్ ప్రొమెనేడ్లో సలీం ఖాన్ కాపలాదారుకు బెదిరింపు లేఖ ఇచ్చి వెళ్లారు. మీడియా కథనాల ప్రకారం, సల్మాన్ ఖాన్, సలీం ఖాన్లకు వచ్చిన బెదిరింపు లేఖలో, సిద్ధూ మూసేవాలాగా వారిని చేస్తామని రాశారు.
సల్మాన్ఖాన్కు బెదిరింపు లేఖ అందిన కొద్దిరోజుల ముందు పంజాబీ గాయకుడు సిద్ధూ మూసేవాలా హత్యకు గురయ్యారు. సల్మాన్ ఖాన్ను చంపడం ద్వారా 1998 కృష్ణజింకల వేటకు ప్రతీకారం తీర్చుకోవాలని లారెన్స్ బిష్ణోయ్ కోరుకుంటున్నారని అంటున్నారు.
2018 సంవత్సరంలో సల్మాన్ ఖాన్ హత్యకు అన్ని సన్నాహాలు చేశానని బిష్ణోయ్ స్వయంగా పోలీసు రిమాండ్లో వెల్లడించాడు. దీని కోసం అతను ప్రత్యేక రైఫిల్ను కూడా కొనుగోలు చేశాడు, దాని కోసం అతను 4 లక్షలు చెల్లించాడు.