40.2 C
Hyderabad
May 6, 2024 16: 34 PM
Slider తూర్పుగోదావరి

శంషాబాద్ to రాజోలు బస్సులో కారం చల్లి దోపిడీ ప్రయత్నం..

శంషాబాద్ నుండి గల్ఫ్ ప్రయాణికులతో కొనసీమ జిల్లాకు వస్తున్న ఏపీఎస్ ఆర్టీసీ ఇంద్ర బస్సు బస్సులో ఆదివారం అర్ధరాత్రి దోపిడీయత్నం జరిగింది. పాలకొల్లు సమీపంలో ప్రయాణికుడి ముసుగులో ఉన్న దొంగ, ఇతర ప్రయాణికులు అందరి పై కారం చల్లి విలువైన వస్తువులు దొంగిలించే ప్రయత్నం చేసాడు.

బస్సు సిబ్బంది తో పాటు ప్రయాణికులు అప్రమత్తమవడంతో దొంగ తప్పించుకొనే ప్రయత్నం చేసాడు. కారం కళ్ళలో చేరి మంట పుట్టిస్తున్నా, ఏం జరుగుతుందో చూసే అవకాశం లేకపోయినప్పటికి ప్రయాణికులు దొంగను ప్రతిఘటించి అడ్డుకొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి దొంగను అదుపులోకి తీసుకొన్నారు. తదుపరి బస్సు ప్రయాణికులతో రాజోలు డిపోకు చేరింది.

Related posts

క‌రోనా స‌మ‌యంలో శ్ర‌మించి సేవ‌లందించిన వారికి రేంజ్ డీఐజీ చిరు స‌త్కారం…!

Satyam NEWS

జగన్ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ కు స్థానచలనం?

Satyam NEWS

టీడీపీ నినాదం.. జేడ్పీ చైర్మన్ నోటి వెంట..!

Bhavani

Leave a Comment