40.2 C
Hyderabad
April 26, 2024 11: 32 AM
Slider విజయనగరం

టీడీపీ నినాదం.. జేడ్పీ చైర్మన్ నోటి వెంట..!

#vijayanagaram

రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న “స్పందన”లో టీడీపీ ఇచ్చిన ప్రజా సమస్యల పై ప్రభుత్వం స్పందికపోవడంతో ఆ పార్టీ “ఇదేం ఖర్మరా ” నిరసన కార్యక్రమం చేపట్టిన సంగతి విదితమే. అయితే దీని పట్ల ఆ పార్టీ కి ఎంత మైలేజ్ వచ్చింది ఏమో గాని…విజయనగరం జిల్లా జేడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాస్… నోటి వెంట ప్రస్తావనకు వచ్చింది. ఈ మేరకు జేడ్పీ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో… టీడీపీ నిర్వహించిన “ఇదేం ఖర్మరా ” అన్న మాట వల్లించారు.మూడేళ్ళ కాలంలో మా ప్రభుత్వం నిర్వహిస్తున్న సంక్షేమ పధకాలు…లబ్ధిదారులు పొందుతున్న ఆనందం చూడలేక…ఓర్వలేక.. టీడీపీ ఇదేం ఖర్మరా ” అంటూ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని….విజయనగరం జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు పేర్కొనడం విశేషం. గతమూడేళ్లగా…రాష్ట్రంలో ప్రతిపక్ష ఒక్కరికీ సంక్షేమ పధకాలతో పాటు వాటి ఫలాలు అందుతున్న తరుణంలో ప్రతి పక్ష టీడీపీ…”ఇదేం ఖర్మరా ” అంటూ కార్యక్రమం చేపట్టడం ద్వారా టీడీపీ కే…ఇదేం ఖర్మ పట్టిందని ప్రజలే అనుకుంటున్నారని జేడ్పీ చైర్మన్ ఎద్దేవా చేసారు. స్వయంగా కేంద్ర మాజీ గా చేసిన అశోక్ గజపతిరాజు… ఎందుకు మంత్రి పదవి కి రాజీనామా చేసారో చెప్పిన ఆయన..ఏడు అంశాలను పరిష్కరించారని చెప్పిన సందర్భంగా ఆవేవో చెప్పాలని..జేడ్పీ చైర్మన్ ప్రశ్నించారు.

Related posts

వాహన వినియోగదారులకు సౌకర్యాలు కల్పించండి

Satyam NEWS

పట్టించుకునే నాథుడు లేక అనాథలా మారిన గురుకుల పాఠశాల

Satyam NEWS

ఉత్త‌రాంధ్ర‌లో ఎన్నిక‌ల క‌మీష‌న‌ర్ నిమ్మ‌గ‌డ్డ ప‌ర్య‌ట‌న‌

Satyam NEWS

Leave a Comment