వైఎస్ఆర్ కడప జిల్లా రాజంపేట లో జరుగుతున్న జాతీయ జూనియర్ వాలీబాల్ ఛాంపియన్ షిప్ పోటీలకు సంబంధించిన క్యాంప్ ఫైర్ ను రాజంపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు అకేపాటి అమర్ నాథ్ రెడ్డి వెలిగించారు. శాసన సభ్యులు మేడా వెంకట మల్లికార్జున రెడ్డి, కడప పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు కె.సురేష్ బాబు కూడా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు.
రాజంపేటలోని ఇన్ ఫాంట్ జోసఫ్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ లో ఈ టోర్నీ జరుగుతున్న విషయం తెలిసిందే. జాతీయ జూనియర్ వాలీబాల్ టోర్నీ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం రాత్రి ప్రారంభించిన క్యాంప్ ఫైర్ లో ఇంకా ఆర్.డి ఓ ధర్మ చంద్ర రెడ్డి, డి.యస్.పి.నారాయణ స్వామి రెడ్డి, ఆర్గనైజ్ సెక్రెటరీ పోలా శ్రీనువాసులు రెడ్డి, బాను మూర్తి రాజు, షామిర్, డి.సి.యం. యస్. చైర్మన్ దండు గోపి తదితరులు కూడా పాల్గొన్నారు.