డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి సందర్భంగా హైదరాబాద్ నల్లకుంట లో కొవ్వొత్తుల నివాళి అర్పించారు. కోరంటి ఫీవర్ హాస్పిటల్ ఎదురుగా శివానంద నగర్ లో అంబేద్కర్ చిత్ర పట్టానికి దళిత చైతన్య వేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి .శంకర్ ఆధ్వర్యంలో పులా మాల వేసి నివాళి అర్పించారు. అనంతరం కొవ్వొత్తులు వెలిగించి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళిత దేవుడైన డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకోవడం ఎంతో సంతోషంగానూ ఆనందంగానూ ఉందన్నారు. ఆయన మనకు ఇచ్చిన స్ఫూర్తి ఆయన చూపించిన ధైర్యం ఆయన మనకు చూపెట్టిన మార్గం ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడూ మర్చిపోలేనిదాన్నారు. దళితుల మొదటి దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే మొదట వినిపించే పేరు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ అని ఆయన చెప్పారు.