39.2 C
Hyderabad
May 3, 2024 11: 20 AM
Slider రంగారెడ్డి

భూవివాదంలో మంత్రి మల్లారెడ్డి బామ్మర్దిపై కేసు నమోదు

#ministermallareddy

మేడ్చల్ జిల్లా గుండ్లపోచంపల్లి మున్సిపల్ లోని భూవివాదంలో  మంత్రి మల్లారెడ్డి బామ్మర్ది, గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ భర్త ముద్దుల శ్రీనివాస్ రెడ్డి తో పాటు15 మందిపై కేసు నమోదు కాగా వారిలో 10మందిని రిమాండుకు తరలించిన్నట్లు పేట్ బషీరాబాద్ పోలీసులు తెలిపారు.

సీఐ రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం గుండ్లపోచంపల్లిలోని సర్వే నంబర్ 5,6లో ఉన్న భూ యజమానులు మల్లారెడ్డి, వేణునాయుడు  మధ్య స్థలవివాదం నడుస్తోంది గత మూడు రోజుల కిందట రాత్రి 1 గంట సమయంలో మల్లారెడ్డికి సంబంధించిన వ్యక్తులు మద్యం సేవించి స్థలంలో ఉన్న కడీలను పడగోట్టి సెక్యురిటీ సిబ్బందిని విచక్షణారహితంగా దాడి చేశారని తమకు అందిన ఫిర్యాదు మేరకు 15 మంది నిందితులపై కేసు నమోదు చేయగా అందులో 10 మందిని ఇప్పటికే రిమాండ్ తరలించామని, మరో 5గురు మంత్రి బామ్మర్ది శ్రీనివాసరెడ్డి, మల్లారెడ్డి, విద్యాసాగర్ రెడ్డి, నర్సింహారెడ్డి లు పరారీలో ఉన్నారని తెలిపారు.

Related posts

కోర్టు అనుమతితో విదేశీ పర్యటనకు వెళ్తున్న జగన్

Satyam NEWS

నేడు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం

Satyam NEWS

పార్టీలకు అతీతంగా ’సర్ధార్‌ సర్వాయిపాపన్న సేన’ ఆధ్వర్యంలో జయంతి వేడుకలు

Satyam NEWS

Leave a Comment