38.2 C
Hyderabad
May 3, 2024 22: 16 PM
Slider కడప

వైయస్ భాస్కర్ రెడ్డి అరెస్టు పై సీబీఐ దిష్టిబొమ్మ దగ్దం

#mekapati

అన్నమయ్య జిల్లా రాజంపేటలో వై.యస్. బాస్కర్ రెడ్డి అరెస్ట్ కు నిరసనగా ఆదివారం జడ్పీ చైర్మన్ అకేపాటి అమర నాధ రెడ్డి ఆధ్వర్యంలో శాంతి యుత ర్యాలీ ని నిర్వహించి సి.బి.ఐ దిష్టి బొమ్మను దహనం చేశారు.ఈ ర్యాలీ ని ఆర్.అండ్.బి. బంగ్లా వద్ద నుంచి పాత బస్ స్టాండ్ వరకు కొన సాగించారు.వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్మడి కడప జిల్లా జడ్పీ చైర్మన్ అకేపాటి అమరనాధ రెడ్డి మాట్లాడుతూ వై.యస్. బాస్కర్ రెడ్డి అరెస్ట్ అక్రమం అని,ఈ అరెస్ట్ చంద్రబాబు నాయుడు కనుసన్నల్లో జరిగిందని అన్నారు.ఎల్లో మీడియా ఇందుకు పూర్తిగా సహరించిందని, ముందు గానే ఈనాడు,ఏబీఎన్, టీవీ 5 లకు లీక్ లు ఇస్తూ కుట్రలు చేశారని ఆరోపించారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, సోదరుడు అవినాష్ రెడ్డి ప్రతిష్టను దెబ్బ తీయడానికి ఈ కుట్ర జరిగిందన్నారు.రాష్ట్ర ప్రజలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అండగా ఉన్నారని తెలిపారు.జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి బంధము రామ లక్ష్మణుల బంధమని అన్నారు.

Related posts

అబద్ధాలు చెప్పడం కాదు మోడీతో వెయ్యి కోట్లు ఇప్పించు

Satyam NEWS

జవహర్ రెడ్డికి కీలక బాధ్యతలు: సీఎస్ గా నియామకం

Satyam NEWS

అటవీ హక్కుల చట్టం కఠినంగా అమలు చేయాలి

Bhavani

Leave a Comment